కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చిన్ననాటి కోచ్ అశోక్ ముస్తఫీ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్ ముస్తఫీ గురువారం ఉదయం మృతి చెందారు. గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఆయన ఏప్రిల్ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్కు గురికావడంతో తుదిశ్వాస విడిచారని ముస్తఫీ కుటుంబ సభ్యులు తెలిపారు.
అశోక్ ముస్తఫీ తన కూతురితో పాటు లండన్లో ఉండేవారు. 'అశోక్ ముస్తఫీ గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఏప్రిల్ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్కు గురికావడంతో తుదిశ్వాస విడిచారు' అని ముస్తఫీ కుటుంబ సభ్యులొకరు మీడియా సమావేశంలో తెలిపారు. పలువురు మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లు ముస్తఫీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బెంగాల్కు క్రికెట్ పాఠాలు నేర్పినదిగా పేరున్న 'దుఖీరామ్ క్రికెట్ కోచింగ్ సెంటర్'లో అశోక్ ముస్తాఫీ ప్రముఖ కోచ్గా ఉండేవారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న 12మంది బెంగాల్ రంజీ క్రికెటర్లుగా ఎదిగారు. సౌరవ్ గంగూలీ చిన్నతనంలో తొలిసారిగా ముస్తాఫీ వద్దే క్రికెట్లో ఓనమాలు దిద్దాడు. దాదా స్నేహితుడు సంజయ్ దాస్ కూడా ఆయన వద్దే క్రికెట్ ప్రారంభించాడు. గంగూలీ టీమ్భారత కెప్టెన్గా అదరగొట్టి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉన్నాడు. గత నెల అశోక్ ముస్తాఫీ ఆరోగ్యం క్షీణించగా.. వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను గంగూలీ, సంజయ్ దగ్గరుండి చూసుకున్నారు.
మొదలైన వన్డే క్రికెట్.. ఇంగ్లండ్ జోరు.. 7 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్