పాక్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి
'ఇటీవలే పాక్తో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ ఓడిపోయింది. పాకిస్థాన్ కంటే మనం మెరుగైన స్థితిలో ఉన్నాం. కాబట్టి భారత్కు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి' అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పాలీ ఉమిగ్రర్ అవార్డు ఇవ్వడంపై కూడా దాదా స్పందించాడు.
కోహ్లీ ఆటపై ఎలాంటి అనుమానం లేదు
"కోహ్లీ 30 ఏళ్ల వయస్సుకు దగ్గర్లోకి వచ్చాడు. మరో ఆరు లేదా ఏడేళ్ల పాటు క్రికెట్ ఆడతాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు" అని గంగూలీ చెప్పాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా పేరిట బీసీసీఐ కొత్తగా నాలుగు అవార్డులు ప్రవేశపెట్టడాన్ని గంగూలీ హర్షించాడు.
అర్జున్కు శుభాకాంక్షలు
చివరగా భారత అండర్-19 భారత జట్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకోవడంపై గంగూలీ మాట్లాడుతూ ‘ముందుగా అర్జున్కు శుభాకాంక్షలు. అతను ఆడటం నేను ఇప్పటి వరకు చూడలేదు. బాగా రాణిస్తాడనే అనుకుంటున్నా' అని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
మెస్సీ మ్యాజిక్ చూడాలనుకుంటున్నా
మరో ఆరు రోజుల్లో రష్యాలో ఆరంభమయ్యే ఫిఫా వరల్డ్ కప్పై కూడా గంగూలీ స్పందించాడు. ‘ఫిఫా వరల్డ్కప్లో బ్రెజిల్ నా ఫేవరెట్ జట్టు. అయినప్పటికీ అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ మ్యాజిక్ చూడాలనుకుంటున్నాను. అతడు ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నా' అని గంగూలీ అన్నాడు.