
న్యూజిలాండ్తో డే/నైట్ టెస్ట్
తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ను తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానానికి తరలివచ్చారు. మరోవైపు భారీ స్థాయిలో అతిధులు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి డే/నైట్ మ్యాచ్ను ఎప్పుడు ఆడుతుందనే విషయంపై ఆసక్తి పెరిగింది. అయితే సమాచారం ప్రకారం కోహ్లీసేన తదుపరి డే/నైట్ టెస్టును న్యూజిలాండ్తో 2020లో ఆడనుందట.

మాకింకా సమయముంది
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 2020లో టెస్టు సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య డే/నైట్ టెస్టు నిర్వహించే అవకాశం ఉందా? అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీని మీడియా అడగ్గా... 'ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం తీసుకోలేదు. కివీస్ టెస్టు సిరీస్కు మాకింకా సమయముంది. చూద్దాం' అని సమాధానం ఇచ్చారు.

డే/నైట్ టెస్టు భవితవ్యంపై చర్చిస్తాం
'డే/నైట్ టెస్టు భవితవ్యంపై ఇప్పుడే మాట్లాడటం సరికాదు. ఈ విషయాన్ని అందరితో కలిసి చర్చిస్తాం. అయితే.. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి జట్లు మన దేశంలో డే/నైట్ టెస్టులు ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి. ఎంత మంది ప్రేక్షకులు స్టేడియానికి తరలివస్తారో ఆలోచించండి. పెద్ద జట్లు భారత్లో డే/నైట్ టెస్టులు ఆడితే పరిస్థితులు చక్కబడతాయి' అని దాదా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications
