ఒక్క మ్యాచ్కే విమర్శలా?
ఇన్ని విమర్శల మధ్య ధోనీకి ఓ అండ దొరికింది. టీమిండియా మాజీ కేప్టెన్ సౌరబ్ గంగూలీ ధోనీకి మద్దతుగా నిలిచాడు. ఆయన బ్యాటింగ్ను తప్పు పట్టాల్సిన పనేమీ లేదంటూ ఎదురుదాడికి దిగారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక్క ఇన్నింగ్తోనే ధోనీని తప్పు పట్టే అర్హత ఎవరికీ లేదని అన్నారు. ధోనీ ఎలాంటి బ్యాట్స్మెన్ అనేది అందరికీ తెలుసని, ఇప్పుడు కొత్తగా ఆయన తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆప్ఘనిస్తాన్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ను ఎదుర్కొన్నప్పుడు ధోనీ ఎలా ఆడారో అందరూ చూశారని, అలాంటప్పుడు ఆయనను ఎలా విమర్శించగలుగుతారని సౌరబ్ గంగూలి నిలదీశారు. గురువారం మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే మ్యాచ్ సందర్భంగా ధోనీ తన సహజ సిద్ధ బ్యాటింగ్ శైలిని అందిపుచ్చుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు.
ఎందుకీ విమర్శలు?
ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా ఈ నెల 22వ తేదీన సౌతాంప్టన్లోని రోజ్బౌల్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ధోనీ చాలా మందకొడిగా బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. 52 బంతులను ఎదుర్కొన్న ధోనీ కేవలం 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో భారీ షాట్ను ఆడాలనే ఉద్దశంతో క్రీజును వదిలి ముందుకొచ్చాడు. బంతి మిస్ అయ్యాడు. అంతే- వికెట్ల వెనుక కాపు కాస్తోన్న కీపర్.. బెయిల్స్ను ఎగురగొట్టేశాడు. నిజానికి- ఆ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు సహా మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు సైతం విఫలం అయ్యారు. ఫలితంగా- 224 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంచగలిగింది టీమిండియా. ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి సరిపోయిందని, అదే ఇంకే జట్టు ఉన్నా లక్ష్యాన్ని అందుకునేదేనని అంటూ సచిన్ టెండుల్కర్ సహా పలువురు క్రికెట్ పండితులు విశ్లేషించారు.