రికార్డును బట్టే కెప్టెన్ ప్రతిభను అంచనా వేస్తాం
అంతేకాదు "ఎప్పుడైనా ఈ రికార్డును బట్టే కెప్టెన్ ప్రతిభను అంచనా వేస్తాం. ధోని, రోహిత్ మూడేసిసార్లు కప్పు గెలిచారు. ఈ దశలో వాళ్లిద్దరితో విరాట్ కోహ్లీని పోల్చలేం. అతను ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. మొదట్నుంచి విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుతోనే ఉన్నాడు. ఏడెనిమిదేళ్లుగా జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. ఫ్రాంఛైజీ ఇంకా తనను కెప్టెన్గా కొనసాగిస్తున్నందుకు అదృష్టవంతుడే. టైటిల్ గెలవకుండా ఏ కెప్టెన్ ఇంత కాలం కొనసాగడు" అని అన్నాడు.
గంగూలీ మాట్లాడుతూ
ఈ వ్యాఖ్యలపై గంగూలీ మాట్లాడుతూ "క్రికెట్కు కోహ్లీ ఏం చేశాడో దాని వల్లే అతడు కెప్టెన్గా కొనసాగింపబడుతున్నాడు. ప్రతి ఫార్మాట్లోనూ బ్యాట్తో అతడు అద్భుతాలు చేశాడు. అతడొక ఛాంపియన్ ప్లేయర్. ఆర్సీబీ జట్టుకు కెప్టెన్ అయ్యేందుకు అన్ని అర్హతలు అతడికి ఉన్నాయి. నేను విశ్వసిస్తున్నా.. ఈసారి తప్పక టైటిల్ గెలుస్తాడు" అని చెప్పాడు.
భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా చాలా సమర్థవంతమైన జట్టని గంగూలీ అన్నాడు. "టోర్నీల్లో ఫలానా జట్టే ఫేవరెట్ అంటూ ఉండే అభిప్రాయాలను నేను నమ్మకపోయినప్పటికీ, భారత జట్టు అన్ని టోర్నీల్లోనూ ఫేవరెట్గా ఉంటుందన్న విషయాన్ని చెప్తున్నా. జట్టులో ధావన్, రోహిత్, కోహ్లీ, ధోనీ, బుమ్రా, కుల్దీప్, భువీ లాంటి మంచి నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లు ఉన్నారు" అని దాదా తెలిపాడు.
కోహ్లీ ఛాంపియన్ ప్లేయర్
"టీమిండియాలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. అతడు బ్యాటింగ్లో ఏ స్థానంలోనైనా దిగగలడు. అయితే, అతడు మూడో స్థానంలో దిగడమే సరైంది. కోహ్లీ పూర్తి స్థాయి ఛాంపియన్. ప్రతి తరంలోనూ ఇటువంటి ఛాంపియన్లు ఉన్నారు. మా తరంలో సచిన్, రికీ పాంటింగ్, లారా వంటి ఆటగాళ్లు ఉన్నారు" అని గంగూలీ అన్నాడు.