For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ బీసీసీఐ వేలం, జియోతో పోటీపడి గెలిచేదెవరు?

Sony Pictures Network, Star India stack up for sports broadcast rights

హైదరాబాద్: క్రికెట్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సొమ్ము చేసుకోవాలని ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా కూడా తీవ్రంగా పోటీపడుతోంది. ఇటీవల జరిగిన వేలంలో కేవలం టీవీ ప్రసార హక్కులను రూ.16 కోట్లకు పైగా అమ్మేసిన బీసీసీఐ ఇప్పడు డిజిటల్ మీడియా హక్కుల కోసం పోటీ జరుపుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌కు సంబంధించి ప్రసార హక్కులంటే సహజంగా ఉండే భారీ పోటీ ఈసారి కూడా కనిపిస్తోంది.

మరోవైపు ఐపీఎల్‌కు సంబంధించి టీవీ ప్రసార హక్కులను కోల్పోయిన సోనీ నెట్‌వర్క్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఐపీఎల్‌ కూడా చేతిలో ఉన్న స్టార్‌కు ఇది కూడా లభిస్తే ఇక తిరుగుండదు. ఇంతటి రసవత్తరమైన పోరులో స్టార్, సోనీలతో పాటు డిజిటల్‌ హక్కుల కోసం జియో, ఫేస్‌బుక్, గూగుల్‌ సైతం పోటీ పడుతున్నాయి. ఇటీవలే నిదహాస్ ట్రోఫీ ద్వారా బాగానే సంపాదించుకున్న 'యప్‌ టీవీ' కూడా తమ అదృష్టాన్ని ఈ వేలంలో పరీక్షించుకోనుంది.

వేలం జరిగేది ఇలా:

వేలం జరిగేది ఇలా:

దీని వల్ల మరింత పారదర్శకతకు అవకాశం ఉంటుందని, బోర్డు అధికారులతో ప్రచార సంస్థలు లోపాయికారీగా సమాచారం తెలుసుకొని అవినీతికి పాల్పడకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో వేలం ప్రక్రియ ప్రారంభమయ్యాక బిడ్డర్లు తాము చెల్లించగలిగే మొత్తాన్ని అందులో పేర్కొనాల్సి ఉంటుంది. అది పెరుగుతూ వెళ్లి చివరకు అత్యధిక మొత్తం వేసిన బిడ్డర్‌కు హక్కులు దక్కుతాయి. అయితే స్క్రీన్‌పై బిడ్డింగ్‌ మొత్తం చూపించినా... అది ఎవరు వేస్తున్నారనేది మాత్రం ప్రదర్శించరు.

వేలంలోనే మూడు రకాల హక్కులు:

వేలంలోనే మూడు రకాల హక్కులు:

తాజా వేలంలో బీసీసీఐ మూడు రకాల హక్కులకు బిడ్‌లను ఆహ్వానించింది. భారతదేశం వరకు టీవీ హక్కులతో పాటు మిగిలిన అన్ని దేశాలకు కలిపి డిజిటల్‌ హక్కులు ఇందులో మొదటిది. భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమయ్యే విధంగా డిజిటల్‌ హక్కులు రెండోది. భారత ఉపఖండం, ఇతర ప్రపంచ దేశాల టీవీ హక్కులతో పాటు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ హక్కులు (గ్లోబల్‌ కన్సాలిడేటెడ్‌ రైట్స్‌) మూడోది.

వేలం ధరలు కింది విధంగా:

వేలం ధరలు కింది విధంగా:

2018-19 సీజన్‌కు ఒక్కో మ్యాచ్‌ కనీస ధర, ఆ తర్వాతి నాలుగేళ్లకు ఒక్కో మ్యాచ్‌ కనీస ధరను వేర్వేరుగా నిర్ణయించారు. వచ్చే సీజన్‌లో డిజిటల్‌ హక్కుల కనీస ధర రూ. 8 కోట్లు కాగా, ఆ తర్వాత అది రూ. 7 కోట్లుగా ఉంది. గ్లోబల్‌ హక్కుల కోసం తర్వాతి నాలుగేళ్ల కాలానికి ప్రతీ మ్యాచ్‌కు రూ. 40 కోట్ల కనీస ధర ఉండటం విశేషం.

ఏయే మ్యాచ్‌లకు సంబంధించిన ప్రసారలంటే:

ఏయే మ్యాచ్‌లకు సంబంధించిన ప్రసారలంటే:

జూన్‌ 2018 నుంచి మార్చి 2023 మధ్య భారత గడ్డపై మొత్తం 102 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 22 టెస్టులు కాగా...45 వన్డేలు, మరో 35 టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్ని మ్యాచ్‌ల ప్రసార హక్కుల కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు వేలం నిర్వహిస్తోంది. సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ), బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి కలిసి ఈసారి సీల్డ్‌ కవర్‌ విధానానికి బదులుగా ఈ-ఆక్షన్‌ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు.

Story first published: Tuesday, April 3, 2018, 11:24 [IST]
Other articles published on Apr 3, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+