
ఐపీఎల్ 10వ సీజన్లో చైనా కంపెనీలు
మరోవైపు ఐపీఎల్ను పలు చైనా కంపెనీలు తమ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. ఐపీఎల్ 10వ సీజన్కు వివో సంస్థ అధికారిక స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ఇక కోహ్లీ సారథ్యంలోని బెంగళూరుతో పాటు కోల్కతా (కేకేఆర్) జట్లకు జియోనీ ప్రధాన స్పాన్సర్గా వ్వవహరిస్తోంది.

జియోనీ చీఫ్ అరవింద్ వోహ్రా ఇలా
‘భారతలో క్రికెట్, బాలీవుడ్ను ఒక మతంగా భావిస్తారు. ఐపీఎల్ ద్వారా ప్రచారం కల్పించుకోవడం ఒక సంస్థగా మాకు ముఖ్యం. ఫ్యాన్స్తో పాటు మాకు కూడా ఇది దీపావళి పండగ వంటిది' అని భారత్లో జియోనీ చీఫ్ అరవింద్ వోహ్రా తెలిపాడు. ఐపీఎల్-10లో ఆర్సీబీ, కేకేఆర్ జట్ల జెర్సీల హక్కుల కోసం జియోనీ సంస్థ రూ.75 కోట్లు ఖర్చు చేసింది.

ప్రతి మ్యాచ్లో ప్రకటనల కోసం 2,300 సెకన్లు
ఐపీఎల్లో ప్రతి మ్యాచ్లో ప్రకటనల కోసం 2,300 సెకన్లను కేటాయించారు. ఇందులో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో అత్యధికంగా 300 సెకన్లను దక్కించుకుంది. ఇందులో 10 సెకన్ల ప్రకటన కోసం రూ.5.2 లక్షలను చెల్లించాలి. ఐపీఎల్ లీగ్కు పలు కంపెనీలు కో-ప్రజెంటింగ్ స్పాన్సర్లు, అసోసియేట్ స్పాన్సర్లుగా వ్వవహరిస్తున్నాయి.

అసోసియేట్ స్పాన్సర్లు రూ.5.75 లక్షలు
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్, ప్రపంచస్థాయి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వేరువేరుగా ప్రకటనల కోసం 210 సెకన్ల నిడివిని దక్కించుకున్నాయి. ఈ రెండు సంస్థలు ప్రతి 10 సెకన్ల కోసం రూ. 5.2 లక్షలను చెల్లిస్తున్నాయి. ఇక అసోసియేట్ స్పాన్సర్లుగా ఉన్న సియట్ టైర్స్, విమల్ పాన్ మసాలా, యమహా మోటార్స్, పార్లే ఆగ్రో ఫ్రూటీ, యెస్బ్యాంకు, పాలీ క్యాబ్, వోల్టాస్, హావెల్స్, మేక్మై ట్రిప్, పార్లే బిస్కేట్స్, మారుతీ సుజుకీ కంపెనీలు 10 సెకన్ల ప్రకటన కోసం రూ.5.75 లక్షలను చెల్లిస్తున్నాయి.


Click it and Unblock the Notifications