రెండో స్థానంలో జెమీమా
బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 765 పాయింట్లతో న్యూజిలాండ్కు చెందిన సుజీ బేట్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఇటీవల కివీస్పై 132 పరుగులు చేసిన భారత ఓపెనర్ జెమీమా నాలుగు స్థానాలు పైకి ఎగబాకి 737 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక, కివీస్ గడ్డపై రెండు హాఫ్ సెంచరీలు సాధించిన స్మృతి మంధాన ఆరో స్థానంలో నిలిచింది.
మూడో టీ20లో మంధాన హాఫ్ సెంచరీ
గత ఆదివారం జరిగిన మూడో టీ20లో మంధాన 86 పరుగులతో ఆకట్టుకుంది. అంతేకాదు గతవారం విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో స్మృతి మంధాన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, బౌలింగ్ ర్యాంకింగ్స్లో రాధ యాదవ్ 18 స్థానాలు పైకి ఎగబాకి 10వ స్థానంలో నిలవగా.. దీప్తి శర్మ ఐదు స్థానాలు పైకి ఎగబాకి 14వ స్థానంలో నిలిచింది.
జట్టు ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో భారత్
ఆల్రౌండర్ జాబితాలో మాత్రం టాప్-10లో ఏ భారత క్రికెటర్ చోటు దక్కించుకోలేకపోయారు. జట్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 283 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, భారత్, వెస్టిండీస్ జట్లు టాప్-5లో కొనసాగుతున్నాయి.