192 పరుగులకే ఆలౌటైన న్యూజిలాండ్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 192 పరుగులకే ఆలౌటైంది. కివీస్ ఓపెనర్లు సుజీ బేట్స్(36), సోఫీ డివైన్(28)లు చక్కటి శుభారంభం ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్కు 61 పరుగులు జోడించిన తర్వాత సోఫీ డివైన్ పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన లారెన్ డౌన్ డకౌట్గా పెవిలియన్కు చేరింది.
70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్
దీంతో న్యూజిలాండ్ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సాటెర్వైట్(31), అమీలా కెర్(28)లు 49 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో న్యూజిలాండ్ రేసులోకి వచ్చింది. చివర్లో హనహ్ రోవ్(25) ఫరవాలేదనిపించింది. భారత బౌలర్లలో ఏక్తాబిస్త్, పూనమ్ యాదవ్లు తలో మూడు వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు, శిఖా పాండేకు ఒక వికెట్ లభించింది.
మంధాన హాఫ్ సెంచరీ
అనంతరం న్యూజిలాండ్ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంధాన, రోడ్రిగ్స్లు దూకుడుగా ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే మంథాన సెంచరీతో మెరవగా, రోడ్రిగ్స్ అర్థ శతకం నమోదు చేసింది. టీమిండియా విజయానికి మూడు పరుగుల దూరంలో ఉండగా మంధాన పెవిలియన్కు చేరింది.