న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'స్మిత్ జీతం నుంచి 20 శాతం జరిమానాగా కట్టాల్సిందే'

 Smith, Australia fined after third ODI

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య ఐదు వన్డే మ్యాచ్‌లలో భాగంగా ఆదివారం మూడో వన్డే జరిగింది. ఈ జట్టులో పరాజయాన్ని చవిచూసిన ఆస్ట్రేలియాకు ఆ ఒక్కటితో ఆగక టాంపరింగ్ వివాదం కూడా నిందను తెచ్చిపెట్టింది.

303 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 286/6కే పరిమితమై 16 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కేటాయించిన సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే రెండు ఓవర్లు తక్కువగా వేసి ఆస్ట్రేలియా జట్టు స్లో ఓవర్‌ రేట్‌ తప్పిదం చేసింది.

సాధారణంగా ఒక ఓవర్‌ తక్కువగా వేస్తే మ్యాచ్ ఫీజులో కెప్టెన్‌కి 20 శాతం, జట్టులోని ఆటగాళ్లకి 10 శాతం జరిమానా రూపంలో కోత విధిస్తారు. అంతేగాక, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే మరోసారి ఆస్ట్రేలియా జట్టు ఇలా స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే.. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ మ్యాచ్ సస్పెన్షన్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఈ వన్డే సిరీస్ కంటే ముందు.. జరిగిన ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ని 4-0తో ఆస్ట్రేలియా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే

బంతిపై స్టీవ్‌స్మిత్ లిప్‌బామ్ రుద్ది ట్యాంపరింగ్‌కి పాల్పడ్డాడంటూ ఇంగ్లాండ్ జట్టు ఆరోపించింది. ఈ వార్తల్ని స్మిత్ కొట్టివేసినా ఇంగ్లాండ్ మాత్రం పట్టువీడట్లేదు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 23, 2018, 13:26 [IST]
Other articles published on Jan 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X