కాన్బెర్రా: మెల్బోర్న్లో మూడో వన్డే సందర్భంగా భారత ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆసిస్ ఆటగాడు జేమ్స్ ఫాల్కనర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఫాల్కనర్ స్లెడ్జింగ్ చేయగా.. కోహ్లీ అందుకు ధీటుగా సమాధానం చెప్పాడు. దీని పైన కోహ్లీ తాజాగా మంగళవారం స్పందించాడు.
స్లెడ్జింగ్ కొనసాగుతుందని కోహ్లీ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇది సాధారణంగా మారిందన్నాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను డిస్టర్బ్ చేసేందుకు స్లెడ్జింగ్ ఉపయోగిస్తారన్నాడు.
అయితే, ఈ స్లెడ్టింగ్ హద్దులు దాటనంత వరకు ఓకేనని చెప్పాడు. అలాగే స్లెడ్జింగ్కు ప్రతిస్పందన కూడా హద్దులు దాటనంత వరకు అంగీకరించవచ్చునని చెప్పాడు. మన చుట్టూ ఎన్నో కెమెరాలు ఉంటాయని, అలాంటప్పుడు ఆటగాళ్లు హద్దులు దాటరని తాను భావిస్తానని చెప్పాడు.