
గోల్ఫ్ ఆడటానికి
ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్, న్యూజిలాండ్ మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాయి. రెండు జట్ల ప్లేయర్స్ సౌథాంప్టన్లోని ఒకే హోటల్లో బస చేస్తున్నారు. అయితే కొంతమంది న్యూజిలాండ్ ప్లేయర్స్ బయో బబుల్ నిబంధనలను విస్మరించి ఉదయం గోల్ఫ్ ఆడటానికి వెళ్లారని క్రిక్బజ్ పేర్కొంది. దీనిపై భారత జట్టు మేనేజ్మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం గురించి ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైందని ఇన్సైడ్ స్పోర్ట్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐసీసీకి ఫిర్యాదు
న్యూజిలాండ్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, ఫిజియో టామీ సిమ్సెక్ ఉదయం వేళ గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని క్రిక్ బజ్ తన నివేదికలో పేర్కొంది. ఇది బయో బబుల్ ప్రోటోకాల్ను ఉల్లంఘించినట్టే అని భారత జట్టు మేనేజ్మెంట్ వాదిస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి కూడా ఫిర్యాదు చేయనున్నారట. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు బయో బబుల్ను వీడి బయటకు వెళ్లిరావడం పట్ల భారత జట్టు యాజమాన్యం ఆందోళన చెందుతున్నది.
WTC Final 2021:సినిమా పేర్లు చెప్పమంటే..తడబడ్డ టీమిండియా ప్లేయర్స్!ఇషాంత్ ఒక్కడే(వీడియో)

ఒకే ప్రాంగణంలో ఉన్నందున
హోటల్, గోల్ఫ్ కోర్సు ఒకే ప్రాంగణంలో ఉన్నందున తమ ఆటగాళ్లు బయో బబుల్ ప్రోటోకాల్ను ఉల్లంఘించలేదని న్యూజిలాండ్ జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఇక ఫైనల్కు ప్రకటించిన 15 మంది సభ్యుల కివీస్ జట్టులో మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్ లేరు. తాజాగా ఇంగ్లండ్పై కివీస్ టెస్ట్ సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ అనంతరం న్యూజిలాండ్ జట్టు మంగళవారం సౌథాంప్టన్కు చేరుకుంది.

న్యూజిలాండ్ జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కోలిన్ గ్రాండ్హోమ్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్.


Click it and Unblock the Notifications












