ఐపీఎల్ 2022లో సన్రైజర్స్ హైదరాబాద్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెగా వేలంలో సన్రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సరైన జట్టును కొనుగోలు చేయలేదని ఆరోపిస్తూ ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో సన్రైజర్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎంతో అనుభవజ్ఞుడైన సైమన్ కటిచ్ను ఈ సారి సన్రైజర్స్ హైదరాబాద్ తమ అసిస్టెంట్ కోచ్గా నియమించుకుంది. సైమన్ కటిచ్కు కోచ్గా ఎంతో అనుభవం ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన సైమన్ కటిచ్ గతంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రధాన కోచ్గా కూడా వ్యవహరించాడు.
కాగా ఐపీఎల్లో మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ సరైన జట్టును కొనుగోలు చేయలేదని సైమన్ కటిచ్ అబిప్రాయపడుతున్నాడు. మెగా వేలం కోసం ముందుగా వేసిన ప్రణాళికలన్నీ కూడా వేలంలో విస్మరించబడ్డాయని ఆయన ఆరోపిస్తున్నాడు. అయితే సైమన్ కటిచ్ తప్పుకోవడంతో ప్రస్తుతం కొత్త అసిస్టెంట్ కోచ్ను వెతికే పనిలో సన్రైజర్స్ యాజమాన్యం ఉంది.
ఇప్పటికే మెగా వేలంలో సరైన జట్టును కొనుగోలు చేయలేదని తీవ్ర నిరాశలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులను ఈ నిర్ణయం మరింత కలవరపెడుతోంది. దీంతో ఈ సారి కూడా లీగ్లో తమ జట్టు ఫేలవ ప్రదర్శన ఇవ్వడం ఖాయమేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. అయితే నిజానికి మెగా వేలంలో సన్రైజర్స్ మెనేజ్మెంట్ సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానుల నుంచి అభిప్రాయాలు ఉన్నాయి. అనేక మంది సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు కూడా చెప్పేశారు. స్టార్ ఆటగాళ్లను వదిలేసి, అనామక ఆటగాళ్లను కోట్ల రూపాయలు పోసి కొనుగోలు చేశారని వారంతా బహిరంగంగానే విమర్శించారు. ఇలాంటి నేపథ్యంలో ఇదే కారణంతో అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి స్క్వాడ్:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, ఫజల్హాక్ ఫరూకీ, టీ. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్.