
గాయంతో టోర్నీ మొత్తానికి దూరం
చివరకు వరల్డ్కప్లో విజయ్ శంకర్తో టీమిండియా బరిలోకి దిగింది. దీంతో మెగా టోర్నీలో అతడి ప్రధర్శన అంతంత మాత్రంగానే ఉండటం విశేషం. చివరకు గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. అయితే, తాజా బంగ్లాదేశ్ పర్యటనను చూస్తే ఎట్టకేలకు ఆ స్థానంలో ఆడే ఆటగాడు దొరికినట్లే కనిపిస్తున్నాడు.

టీ20ల్లో అయ్యర్ అద్భుత ప్రదర్శన
అతడెవరో కాదు శ్రేయస్ అయ్యర్. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రాణిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా వన్డేల్లో, సొంతగడ్డపై బంగ్లాదేశ్తో ముగిసిన మూడు టీ20ల్లో అయ్యర్ అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహారించాడు.

62 పరుగులతో నాటౌట్గా నిలిచిన అయ్యర్
అయ్యర్ స్పెషాలిటీ ఏంటంటే పరిస్థితులకు తగినట్లు తన ఆటతీరు మార్చుకోవడం. నాగ్పూర్ వేదికగా బంగ్లాతో చివరి టీ20లో 35 పరుగులకే 2 వికెట్లు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అయ్యర్ తొలుత నెమ్మదిగా ఆడి ఆ తర్వాత స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో అయ్యర్ 62 పరుగులతో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

బంగ్లా సిరిస్లో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్
తొలుత కేఎల్ రాహుల్తో కలిసి మూడో వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అయ్యర్ ఆ తర్వాత పంత్తో కలిసి నాలుగో వికెట్కు 45 పరుగులు జోడించాడు. తొలి టీ20లోనూ ధావన్తో కలిసి శ్రేయాస్ అయ్యర్ (34) పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక, రెండో టీ20లో రోహిత్ ఔటైన తర్వాత 125/2తో ఉన్న దశలో క్రీజులోకి వచ్చి అయ్యర్ (24 నాటౌట్) జట్టుకు విజాయన్ని అందించాడు. ఇలా బంగ్లాతో సిరీస్లో ఆకట్టుకున్నాడు. అయితే, నాలుగో స్థానంలో తాను రాణించడానికి జట్టు మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రోత్సాహామేనని అయ్యర్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












