T20 Mumbai League 2025: టీ20 ముంబై లీగ్ 2025లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు బాంద్రా బ్లాస్టర్స్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఆకాష్ పార్కర్ అద్భుతమైన ఆటతీరు, ఇషాన్ ముల్చందాని అర్థ సెంచరీతో జట్టు ఈ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఫైనల్లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్తో తలపడనుంది. ఇటీవల శ్రేయస్ అయ్యర్ తన సారథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టును ఐపీఎల్ 2025 ఫైనల్కు చేర్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రెండో సెమీ ఫైనల్ లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్.. ఈగల్ థానే స్ట్రైకర్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. సిద్దేష్ లాడ్ అజేయ అర్థ సెంచరీ చేయగా.. రోహన్ రాజే 5 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ జూన్ 12న వాంఖడే స్టేడియంలో జరగనుంది.
ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ అద్భుత విజయం
తొలి సెమీఫైనల్లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్.. ఈగల్ థానే స్ట్రైకర్స్ను సునాయాసంగా ఓడించింది. సిద్దేష్ లాడ్ అద్భుతమైన బ్యాటింగ్తో అజేయ అర్థ సెంచరీ సాధించాడు. రోహన్ రాజే బౌలింగ్లో అద్భుతాలు చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు.అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా స్ట్రైకర్స్ జట్టు 20 ఓవర్లలో కేవలం 131/8 పరుగులు మాత్రమే చేయగలిగింది.

132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మరాఠా రాయల్స్ జాగ్రత్తగా ప్రారంభించింది. సాహిల్ జాదవ్.. సైరాజ్ పాటిల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సిద్ధేష్ లాడ్ తెలివిగా బ్యాటింగ్ చేశాడు. సిద్దేష్ లాడ్ చిన్మయ్ సుతార్ (19)తో కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చిన్మయ్ సుతార్.. అత్తార్డే బౌలింగ్లో పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాడు. కానీ సిద్ధేష్ లాడ్ క్రీజులో నిలబడ్డాడు. సచిన్ యాదవ్ (19 నాటౌట్)తో కలిసి 55 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించాడు. సిద్దేష్ లాడ్ 52 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతను తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అతను ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో మరాఠా రాయల్స్ ఫైనల్కు చేరుకుంది.
ఫైనల్కు చేరిన శ్రేయస్ అయ్యర్ జట్టు
రెండో సెమీ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని సోబో ముంబై ఫాల్కన్స్ బాంద్రా బ్లాస్టర్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయం ఆకాష్ పార్కర్, ఇషాన్ ముల్చందాని కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్ 130 పరుగులు చేసింది. బాంద్రా బ్లాస్టర్స్ తరఫున ధ్రూమిల్ మట్కర్ (34), ఆకాష్ ఆనంద్ (31) జట్టుకు అత్యధిక పరుగులు చేశారు. ఆకాష్ పార్కర్ సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సోబో ముంబై ఫాల్కన్స్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ ముల్చందాని అజేయంగా 52 పరుగులు చేశాడు. ఆకాష్ పార్కర్ (32), అంగ్క్రిష్ రఘువంశీ (27) కూడా వేగంగా పరుగులు చేశారు.
ఈ ఫైనల్ మ్యాచ్ జూన్ 12న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్లు ఫైనల్ గెలవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. మరాఠా రాయల్స్ కెప్టెన్ సిద్ధేష్ లాడ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సోబో ముంబై ఫాల్కన్స్లో ఆకాష్ పార్కర్, ఇషాన్ ముల్చందాని వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.