హైదరాబాద్: ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్ షూటింగ్ టోర్నీలో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. మంగళవారం జరిగిన మిక్స్డ్ విభాగంలో హీనా సిద్ధూతో కలిసి పసిడి గెలిచిన జీతూ రాయ్ సింగిల్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్స్కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు.
టోర్నీలో భాగంగా గురువారం ఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్కు అర్హత పోటీలు నిర్వహించారు. పురుషుల విభాగంలో 572 (94, 96, 96, 97, 95, 94) పాయింట్లతో జీతూ రాయ్ 9వ స్థానంలో నిలిచాడు.

టాప్-8లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు మాత్రమే ఫైనల్స్కు అర్హత సాధించారు. అయితే జీతూ రాయ్ ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో పూజ ఘట్కర్ కూడా నిరాశ పరిచింది. పూజ ఘట్కర్ 9వ స్థానంలో నిలిచింది.