
ఒక నిమిషం నా గుండెను ఆపేసింది:
భారత్ క్రికెట్కు తన రిటైర్మెంట్పై ఉన్ముక్త్ చంద్ స్పందిస్తూ... 'భారత్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం కాస్త బాధ కలిగించింది. చాలాకాలంగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. మిశ్రమ భావోద్వేగాలు కలిగాయి. తాజా రిటైర్మెంట్తో భారత్ క్రికెట్కు ఇక ప్రాతినిధ్యం వహించలేననే విషయం ఒక నిమిషం నా గుండెను ఆపేసింది. కానీ విదేశీ లీగ్ల్లో ఆడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంతకాలం నాకు అండగా నిలిచిన భారత క్రికెట్ ప్రేమికులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా' అని అన్నాడు.

లక్ష్యంతోనే క్రికెట్ ఆడాను:
దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న ఏకైక లక్ష్యంతోనే క్రికెట్ ఆడుతూ పెరిగానని ఉన్ముక్త్ చంద్ పేర్కొన్నాడు. ఆటపై తనకున్న మమకారం చాలా స్వచ్ఛమైనదని, ఈ క్రమంలో కొన్ని మైలురాళ్లు అధిగమించానని చెప్పుకొచ్చాడు. కెరీర్ ప్రారంభంలోనే తనకు అవకాశాలు కల్పించిన డీడీసీఏకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు. దిగ్గజ ఆటగాళ్ల మధ్య ఏళ్ల తరబడి గడపడం గొప్ప విషయమని ఉన్ముక్త్ తెలిపాడు. సహచరులుకు, కోచ్లకు, సపోర్ట్ స్టాఫ్కు కృతజ్ఞతలు తెలిపిన ఉన్ముక్త్.. ఈ జ్ఞాపకాలు ఎల్లకాలం తనతో ఉండిపోతాయని చెప్పుకొచ్చాడు.

21 మ్యాచ్లాడి 300 పరుగులు:
2012 అండర్-19 ప్రపంచకప్ తర్వాత భారత-ఎ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉన్ముక్త్ చంద్.. రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. కెప్టెన్గా కూడా టీమ్ని ముందుండి నడిపించాడు. ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్లోనూ దాదాపు ఎనిమిది సీజన్లు ఆడిన ఉన్ముక్త్.. ఆ టీమ్కి కెప్టెన్గా కూడా పనిచేశాడు. కానీ 2017 విజయ్ హజారే ట్రోఫీ ముంగిట అతనిపై వేటు పడగా.. ఆ తర్వాత 2019లో అతను ఉత్తరాఖండ్ టీమ్కి మారాడు. మళ్లీ మనసు మార్చుకుని ఢిల్లీ జట్టులోకి వచ్చేశాడు. అయితే 2020-21 సీజన్లో మాత్రం అతనికి ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కలేదు. అలానే 2011 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న ఉన్ముక్త్.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ టీమ్కి ప్రాతినిథ్యం వహించాడు. ఇన్నేళ్లలో కేవలం 21 మ్యాచ్లాడి 300 పరుగులు చేశాడు.
ప్రైవేట్ లీగ్లలో ఆడేందుకే:
భారత క్రికెట్కి గుడ్ బై చెప్పిన ఉన్ముక్త్ చంద్.. విదేశీ ప్రైవేట్ లీగ్లు ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రైవేట్ టీ20 లీగ్స్లో ఆడితే.. ఐపీఎల్లోనూ అతను ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. టీమిండియాకి రెండు సార్లు ఎంపికయ్యేలా కనిపించిన ఉన్ముక్త్ చంద్కి అదృష్టం ఏమాత్రం కలిసిరాలేదు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్కప్కి ఎంపిక చేసిన 30 మంది ప్రాబబుల్స్లో చంద్కి చోటు దక్కింది. కానీ భారత్ తుది జట్టులో మాత్రం అవకాశం రాలేదు. దాంతో 28 ఏళ్ల ఈ ఢిల్లీ క్రికెటర్ కెరీర్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకుండానే ముగిసింది.


Click it and Unblock the Notifications












