
భరత్ అరుణ్ మాట్లాడుతూ "దూబె ఉత్తేజకరమైన ఆటగాడు. ప్రతి మ్యాచ్ నుంచి అతడు ఆత్మ విశ్వాసం పొందుతున్నాడని నేను భావిస్తున్నాను. ముంబై వేదికగా వెస్టిండిస్తో జరిగిన తొలి టీ20లో తొలి ఓవర్ వేసిన తర్వాత అతడు పుంజుకున్న విధానం ప్రశంసించదగింది. కెప్టెన్ కోహ్లీ కూడా అతడిపై విశ్వాసం ఉంచాడు" అని అన్నాడు.
అతడిలో ఆత్మవిశ్వాసం పొందే కొద్దీ మంచి ఆల్రౌండర్ అవుతాడని భరత్ అరుణ్ చెప్పుకొచ్చాడు. మరోవైపు యువ పేసర్ దీపక్ చాహర్పై కూడా అరుణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఐపీఎల్లో దీపక్ అద్భుతంగా రాణించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. నెమ్మదైన బౌన్సర్లు, యార్కర్లు వేయగలడు" అని అన్నాడు.
"అంతర్జాతీయ స్థాయికి కావాల్సినవన్నీ అతడిలో ఉన్నాయి. జట్టు సమతూకం గురించి ఆలోచిస్తున్నాం. జడేజాను ఆల్రౌండర్గా ఉపయోగించుకోగలం. అవసరమైనప్పుడు కుల్దీప్, చాహల్ ఇద్దరినీ ఆడిస్తున్నాం" అని పేర్కొన్నాడు. ఆదివారం నుంచి విండిస్తో జరిగే మూడు వన్డేల సిరిస్లో కూడా భారత బౌలర్లు రాణిస్తాడని భరత్ తెలిపాడు.
"ఎక్కువ మంది బౌలర్లు రాణిస్తే జట్టుకు మంచిది. ఎంచుకోవడానికి ఎక్కువ వనరులు ఉంటాయి. చివరగా మూడు మ్యాచ్ల్లో టీమిండియా గెలిచిన చివరి రెండు మ్యాచ్ల్లో మన బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ప్రత్యర్ధి జట్టుని తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. విండిస్ సైతం గట్టి పోటీ ఇచ్చింది" అని అన్నాడు.
"న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వాతావరణం, పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని బౌలర్లను తీసుకుంటాం. జడేజా రెడీమేడ్ ఆల్రౌండర్. వరల్డ్కప్లో అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్లో రాణించాడు. సుందర్ కచ్చితంగా వన్డేల్లోకి వస్తాడు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు" అని భరత్ అరుణ్ వెల్లడించాడు.