For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేశం కన్నా ఏదీ గొప్పది కాదు: శిఖర్ ధావన్

IND vs PAK WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL) 2025లో పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌పై శిఖర్ ధావన్ కీలక ప్రకటన చేశారు. దేశం కన్నా ఏదీ గొప్పది కాదని, తాను పాకిస్థాన్ జట్టుతో ఎలాంటి మ్యాచ్‌లు ఆడబోనని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు శిఖర్ ధావన్ నిరాకరించారు. దీనిపై తన జట్టుకు ఒక లేఖ కూడా రాశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి మ్యాచ్‌లు ఆడకూడదనే తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని శిఖర్ ధావన్ అన్నారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL) 2025లో ఆదివారం(నేడు) భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ చేయబడింది. అయితే ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు.

శిఖర్ ధావన్ ప్రకటన
శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. "మే 11న తీసుకున్న నిర్ణయానికి నేను ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాను. నా దేశం నాకు సర్వస్వం, దేశం కన్నా గొప్పది ఏదీ లేదు. జై హింద్" అని ఆయన అన్నారు.దీంతో పాటు శిఖర్ ధావన్ తాను తన జట్టుకు పంపిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. అందులో, "రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో పాకిస్తాన్ జట్టుతో జరిగే ఏ మ్యాచ్‌లోనూ శిఖర్ ధావన్ ఆడరని అధికారికంగా ధ్రువీకరించబడింది. ఈ నిర్ణయం మే 11, 2025న కాల్,వాట్సాప్ చర్చల సమయంలో ఇప్పటికే తెలియజేయబడింది. ప్రస్తుత పరిస్థితిని,భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను పరిగణనలోకి తీసుకుని శిఖర్ ధావన్ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు" అని రాసి ఉంది.

Shikhar Dhawan Refuses to Play Against Pakistan in WCL 2025

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు
ఆదివారం(నేడు) జరగాల్సిన భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్‌ను రద్దు చేశారు. దీనిపై నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ భారత ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు చెప్పారు. "దేశానికి ఇంతటి కీర్తిని తీసుకొచ్చిన భారత క్రికెట్ దిగ్గజాలకు మేము తెలియకుండానే అసౌకర్యాన్ని కలిగించాము. బ్రాండ్లను కూడా ప్రభావితం చేశాము. ఈ కారణంగానే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలని మేము నిర్ణయించుకున్నాము" అని ప్రకటనలో పేర్కొన్నారు.

పహల్గామ్ దాడి తర్వాత భారత క్రికెటర్ల ఆగ్రహం
2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. దీని తర్వాత షాహిద్ అఫ్రిది సహా పలువురు పాకిస్తాన్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా విషం కక్కారు. ఈ దాడి, పాకిస్తాన్ క్రికెటర్ల ప్రవర్తన పట్ల భారత ఆటగాళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ తర్వాతే శిఖర్ ధావన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్నారు.

Story first published: Sunday, July 20, 2025, 11:04 [IST]
Other articles published on Jul 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+