
ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్
సఫారీ గడ్డ మీద భారత్ వన్డే సిరీస్ నెగ్గడంలో ముఖ్య పాత్ర పోషించిన గబ్బర్.. వార్నర్ లేని లోటు తీరుస్తాడని ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ యాజమాన్యం భావించింది. దానికి తగ్గట్టుగానే తొలి మ్యాచ్లో రాజస్థాన్పై 78 పరుగులతో నాటౌట్గా నిలిచిన ధావన్.. తర్వాతి మ్యాచ్లో ముంబైపై 45 పరుగులు చేశాడు. తర్వాత మోచేతికి గాయమైనప్పటి నుంచి ధావన్ ఆట గాడి తప్పింది.

బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విలియమ్సన్
దీంతో బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విలియమ్సన్ మోయాల్సి వస్తోంది. ఓపెనర్ ధావన్ 9 మ్యాచ్ల్లో 20 సగటుతో చేసింది 198 రన్సే. మిగతా జట్లతో పోలిస్తే.. అసలే సన్రైజర్స్ మిడిలార్డర్ బలహీనం. దీంతో బ్యాటింగ్ విభాగం మరింత బలహీనమైంది. బౌలర్లు రాణించడంతో తక్కువ స్కోర్లను కాపాడుకుంటూ మ్యాచ్లు గెలుస్తోంది.

అతడేమీ ఫామ్ కోల్పోలేదని
ప్లేఆఫ్ దశకు చేరువవుతున్న వేళ గబ్బర్ మళ్లీ పుంజుకుంటాడని సన్రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది. అతడేమీ ఫామ్ కోల్పోలేదని, తర్వాతి మ్యాచ్ల్లో తనదైన ఆటతీరు కనబరుస్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది. గాయం కారణంగా అతడి లయ దెబ్బతింది.

బ్యాటింగ్కు బాగా అనుకూలం కావడంతో ధావన్
ఒకట్రెండు రోజుల తేడాతో.. ఢిల్లీ లేదంటే పుణేలో జరిగే మ్యాచ్ల్లో అతడు సత్తా చాటుతాడని కోచ్ టామ్ మూడీ నమ్మకాన్ని వెలిబుచ్చాడు. ధావన్ లాంటి మంచి ఆటగాళ్లు వెంటనే ఫామ్ను కోల్పోరు. తమ ఫామ్ను పునరావృతం చేస్తారు. ఫిరోజ్ షా వికెట్ బ్యాటింగ్కు బాగా అనుకూలం కావడంతో ధావన్ అక్కడైనా బాగా రాణిస్తాడేమోనని జట్టు ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications












