
విరాట్ కోహ్లీ తర్వాత శిఖర్ ధావన్
ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి(641) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్కు చెందిన యువ క్రికెటర్ ఫకార్ జమాన్(576) నిలిచాడు. 2018లో ఫకార్ జమాన్ ఈ పరుగులు సాధించాడు. ఇక, ఈ ఏడాది 500కుపైగా పరుగులు చేసిన ఐదో బ్యాట్స్మన్గా ధావన్ నిలిచాడు.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన ధావన్
తాజాగా విండిస్తో ముగిసిన మూడు టీ20ల సిరిస్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన శిఖర్ ధావన్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను అధిగమించాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ టీ20ల్లో రోహిత్ శర్మ 560 పరుగులు సాధించాడు.

వెస్టిండిస్పై తొలి సెంచరీ నమోదు చేసిన ధావన్
గత ఆరు టీ20ల్లో హాఫ్ సెంచరీ సాధించడంలో విఫలమైన శిఖర్ ధావన్ వెస్టిండిస్తో జరిగిన ఆఖరి టీ20లో మాత్రం 92 పరుగులతో రాణించాడు. అంతేకాదు వెస్టిండిస్పై ధావన్కి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆఖరి టీ20లో టీమిండియా విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్ను 3-0తో కైవసం చేసుకుంది.

తాజా విజయంతో భారత్ ఖాతాలో మరో రికార్డు
తద్వారా టీ20 సిరీస్ను 3-0 తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. భారత్ జట్టు మూడుసార్లు 3-0తో టీ20 సిరీస్ను గెలవగా, పాకిస్తాన్ ఐదుసార్లు విజయం సాధించింది. అప్ఘానిస్తాన్తో కలిసి భారత్ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, యూఏఈ, వెస్టిండీస్లు ఒక్కోసారి మాత్రమే 3-0తో టీ20 సిరీస్లను గెలిచాయి.


Click it and Unblock the Notifications

