న్యూఢిల్లీ: టీమిండియా పార్ట్ టైం బౌలర్ శిఖర్ ధావన్ బౌలింగ్ శైలిపై దక్షిణాఫ్రికా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఫ్రీడమ్ సిరిస్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన నాల్గవ టెస్టులో శిఖర్ ధావన్ మూడు ఓవర్లు వేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శిఖర్ ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారులు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ధావన్ వేసిన ఆఫ్ స్పిన్ బంతులు నియమావళికి లోబడి వున్నాయా? లేవా? అన్న విషయమై తమకు సందేహాలున్నాయని మ్యాచ్ రిఫరీ వెల్లడించారు.
దీనిపై ఐసీసీ విచారణకు ఆదేశించింది. ఇది ఇలా ఉంటే ఓపెనర్ అయిన శిఖర్ ధావన్ సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్ల్లో చాలా అరుదుగా బౌలింగ్ చేస్తుంటాడు. ఇప్పటివరకు టీ20, వన్డేల్లో ఒక్క సారిగా కూడా బౌలింగ్ వేయలేదు. భారత్ తరుపున 19 టెస్టు మ్యాచ్లాడిన ధావన్ కేవలం 9 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.
కాగా, ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓ ఓవర్ను మెయిడిన్గా ముగించి 9 పరుగులిచ్చిన సంగతి తెలిసిందే.