|
పృథ్వీ షా (50) 56 బంతుల్లో హాఫ్ సెంచరీ
పృథ్వీ షా (50) 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతనితో పాటు మరో ఎండ్లో ఉన్న పూజారా(38)49 బంతులు ఆడాడు. అరంగ్రేటం మ్యాచ్లో ఒత్తిడిగా ఉందని అయినా బౌలర్లను ఎదుర్కొని జట్టుకు మంచి స్కోరు సాధిస్తానని షా మాటిచ్చాడు. ఈ మ్యాచ్ జరిగే ముందు పూజారా చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.
అత్యున్నత స్థాయిని అందుకోవడంలో తండ్రి పాత్ర
ఈ క్రమంలో భారత టెస్టు జట్టులోకి వచ్చే ముందు.. వచ్చాక కొన్నేళ్ల పాటు చెతేశ్వర్ పుజారా తన ఊర్లో, ఇంట్లో జరిగే ఏ పండుగల్లోనూ పాల్గొనేవాడు కాదట. పుజారాకు క్రికెట్లో ఓనమాలు నేర్పి, అతను అత్యున్నత స్థాయిని అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన తండ్రి ఈ విషయంలో అతడికి ఆంక్షలు విధించాడట. ‘మా నాన్న చాలా కఠినంగా ఉండేవాడు.'
దీపావళికి టపాసులూ కాల్చనిచ్చేవాడు కాదు
'ముఖ్యంగా నా కెరీర్ తొలి రోజుల్లో. మా ఊర్లో జరిగే గాలిపటాల పండుగకు నన్ను వెళ్లనిచ్చేవాడు కాదు. అలాగే దీపావళికి టపాసులూ కాల్చనిచ్చేవాడు కాదు. అలా చేసి నేను గాయపడితే కొన్ని రోజులు ప్రాక్టీస్కు దూరమవుతానేమో అని ఆయన భయం. ఆయన అంత కఠినంగా ఉండటం వల్లే నేను ఆటపై శ్రద్ధ పెట్టగలిగా. నాకు 17 ఏళ్ల వయసుండగా అమ్మను కోల్పోయా. అయినప్పటికీ స్థైర్యం కోల్పోకుండా ఆట మీదే దృష్టిసారించగలిగానంటే అందుక్కారణం నాన్నే' అని పుజారా చెప్పాడు.
|
బరిలోకి దిగిన ఇరు జట్ల వివరాలు
భారత్ జట్టు:
Lokesh Rahul, Prithvi Shaw, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravichandran Ashwin, Ravindra Jadeja, Umesh Yadav, Mohammed Shami, Kuldeep Yadav
వెస్టిండీస్ జట్టు:
Kraigg Brathwaite (c), Kieran Powell, Shimron Hetmyer, Shai Hope, Roston Chase, Sunil Ambris, Shane Dowrich (wk), Keemo Paul, Devendra Bishoo, Sherman Lewis, Shannon Gabriel