For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్ జెర్సీలో రాజస్థాన్: బ్రాండ్ అంబాసిడర్‌గా షేన్ వార్న్

 Shane Warne joins Rajasthan Royals in new role, named brand ambassador

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు 2008లో ఐపీఎల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

2011 వరకు రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన షేన్ వార్న్ ఆ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గత సీజన్‌లో రాయల్స్‌ జట్టుకు వార్న్‌ మెంటార్‌గా ఉన్నాడు. మరోవైపు ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇన్నాళ్లు బ్లూ జెర్సీలతో ఆడిన ఆ జట్టు ఈ సీజన్‌లో పింక్‌ జెర్సీలు ధరించనుంది.

గులాబీ రంగుకు, రాజస్థాన్‌కు అవినాభావ సంబంధం ఉందని.. దానిని ప్రతిబింబించే విధంగా ఈ సీజన్‌లో జెర్సీ రంగును మార్చినట్టు ఫ్రాంచైజీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Story first published: Monday, February 11, 2019, 10:20 [IST]
Other articles published on Feb 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+