హైదరాబాద్: అభిమానుల ఉత్కంఠ, ఆటగాళ్ల బౌండరీల వేటతో ఐపీఎల్ 2018 సిరీస్ ముగిసింది. ఈ క్రమంలో దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ అనంతరం ఆటగాళ్లు ఏం చేయాలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలు తెలిసినవే. ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో ఈనెల 31న ఛారిట్రబుల్ టెస్టులో ఐసీసీ ప్రపంచ ఎలెవన్ జట్టు ఆడనుంది. అయితే అనూహ్యంగా జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి.
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో పేసర్ మొహమ్మద్ షమీని ఎంపిక చేయగా, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ను కొత్తగా తీసుకున్నారు. గతేడాది హారికేన్ల కారణంగా కరీబియన్ దీవుల్లోని క్రికెట్ స్టేడియాలన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణ కోసం లార్డ్స్ మైదానంలో వరల్డ్ ఎలెవన్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్తో నిధులు సేకరించేందుకు సిద్ధమయ్యారు.
వరల్డ్ ఎలెవన్ జట్టు విషయానికొస్తే భారత్ నుంచి వికెట్కీపర్, బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్తో పాటు షమీ ఉండగా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల నుంచి ఒక్కో ఆటగాడు ఉన్నారు. ఇక న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల తరఫున ఇద్దరేసి ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు.
ఐసీసీ వరల్డ్ ఎలెవన్: మోర్గాన్(కెప్టెన్), అఫ్రిదీ, తమీమ్ ఇక్బాల్, దినేశ్ కార్తీక్, రషీద్ఖాన్, సందీప్ లామిచానె, మిచెల్ మెక్క్లీగన్, షోయబ్ మాలిక్, తిసార పెరెర, ల్యూక్ రోంచి, అదిల్ రషీద్, మహ్మద్ షమీ.