
షమీ, యాదవ్ అదుర్స్
వెస్టిండీస్తో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్లో భాగంగా నార్త్ సౌండ్లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపాడు.

షమీ, యాదవ్ అదుర్స్
నిప్పులు చెరిగే బౌలింగ్తో విరుచుకుపడి కరీబియన్ల వెన్ను విరిచాడు. భారత్ పేసర్లు మహ్మమద్ షమీ(4/66), ఉమేష్ యాదవ్(4/41) విజృంభించిన వేళ వెస్టిండీస్ 243 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో తొలి టెస్ట్లో భారత్ పట్టుబిగించింది.

షమీ, యాదవ్ అదుర్స్
ఫాలోఆన్కు దిగిన విండీస్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి 21/1తో నిలిచింది. భారత్కు లక్ష్యం నిర్దేశించాలంటే విండీస్ మరో 302 పరుగులు పైన సాధించాల్సి ఉంది.

షమీ, యాదవ్ అదుర్స్
ఓవర్నైట్ స్కోరు 31/1తో మూడోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్కు భారత బౌలర్ షమి, ఉమేశ్ యాదవ్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరూ విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు అమిత్ మిశ్రా (2/43) రాణించాడు.


Click it and Unblock the Notifications











