అసలేం జరిగింది?
2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా ఓ బుకీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని షకీబ్కు ఓ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. తనను బుకీ కలిసి ఆఫర్ ఇచ్చిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక మరియు భద్రతా విభాగానికి (ఎసిఎస్యు) షకీబ్ నివేదించలేదు. కానీ అతను అలా చేయలేదు.
— ICC (@ICC) 29 October 2019 |
ఆర్టికల్ 2.4.4 ప్రకారం
దీంతో ఆర్టికల్ 2.4.4 ప్రకారం షకీబ్పై రెండు అభియోగాలు నమోదయ్యాయి. 2018 ఐపీఎల్ సందర్భంలో 2018 ఏప్రిల్ 26న సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా బుకీలు సంప్రదించడాన్నీ వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. దీంతో ఐసీసీ అతనిపై విచారణకు ఆదేశించింది.
|
మూడు చార్జ్లను ఉల్లంఘించానని అంగీకరించిన షకీబ్
విచారణలో యాంటీ కరప్షన్ కోడ్లోని మూడు చార్జ్లను ఉల్లంఘించినట్లు షకీబ్ దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్కు శిక్షను ఖరారు చేసింది. నిషేధ కాలంలో ఐసీసీ నిబంధనలు సక్రమంగా పాటిస్తే 2020 అక్టోబర్ 29 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఐసీసీ అనుమతి ఇవ్వడం కొసమెరుపు.
షకీబ్ లేకుండా కొత్త జట్టు
షకీబ్పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం విధించిన నేపథ్యంలో బంగ్లా క్రికెట్ బోర్డు షకీబ్ ఉల్ హాసన్ లేకుండా తాజా టీ20 జట్టును ప్రకటించనుంది. బుధవారం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. భారత పర్యటనకు షకీబ్ దూరమైతే ముష్ఫికర్ రహీమ్ టెస్టులు, మొసాదిక్ హుస్సేన్ టీ20లకు నాయకత్వం వహించనున్నారు.