For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత ప్రధానిపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు.. మోడీ పదవిలో ఉన్నంత కాలం!!

Shahid Afridi feels Relationship between India and Pakistan has damaged because of PM Modi

కరాచీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోడీ ప్రధాని పదవిలో ఉన్నంత కాలం భారత్‌-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు జరగవవు అని అన్నాడు. రెండు దేశాల ప్రజలు సరిహద్దులు దాటాలని భావిస్తుంటే.. ఆయనేమో తిరోగమనం వైపు పయనిస్తున్నారని ఆఫ్రిది అంటున్నాడు. భారత్‌, కశ్మీర్‌ రాజకీయాలపై కూడా గతంలో ఆఫ్రిది అవాకులు చవాకులు పేల్చిన విషయం తెలిసిందే.

ఒకే ఒక వ్యక్తి కారణం:

ఒకే ఒక వ్యక్తి కారణం:

తాజాగా షాహిద్ ఆఫ్రిది ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ... 'భారత్‌, పాకిస్తాన్ దేశాల మధ్య మంచి సంబంధాలు లేకపోవడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోడీ. మోడీ అధికారంలో ఉన్నంత వరకు భారత్‌ నుంచి మనకు స్పందన రాదు. భారతీయులు సహా మనందరికీ మోడీ ఎలా ఆలోచిస్తారో తెలుసు. ఆయన తిరోగమన ఆలోచనా ధోరణితో ఉన్నారు' అని అన్నాడు.

మోడీ ఎజెండా ఏంటో:

మోడీ ఎజెండా ఏంటో:

'సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి మరొకరు ప్రయాణించాలని చూస్తున్నారు. కానీ.. భారత ప్రధాని మోడీ ఆలోచనలు మాత్రం తిరోగమనాన్ని సూచిస్తున్నాయి. అసలు మోడీ ఎజెండా ఏంటో, ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థమవ్వడం లేదు' అని అఫ్రిది అంటున్నాడు. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి మాట్లాడుతూ భారత క్రికెట్‌ను మెచ్చుకున్నాడు.

ఐపీఎల్ భారత క్రికెట్‌ను మార్చింది:

ఐపీఎల్ భారత క్రికెట్‌ను మార్చింది:

'ఐపీఎల్ భారత క్రికెట్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అగ్రశ్రేణి విదేశీ ఆటగాళ్లతో భారత యువకులు ఆడుతున్నారు, డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చినప్పుడు సవాళ్లకు సిద్ధంగా ఉంటున్నారు. ఐపీఎల్ భారత క్రికెట్‌ను మార్చిందని నేను భావిస్తున్నా. పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా అదే చేస్తుందనుకుంటున్నా. ఇప్పటికే మేము కొంతమంది ప్రతిభ గల యువ ఆటగాళ్లను లీగ్ ద్వారా చూస్తున్నాం. అంతర్జాతీయ ఆటగాళ్లతో ఆడినప్పుడు యువకులు ఒత్తిడిని ఎలా జయించాలో నేర్చుకుంటారు' అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టోర్నీలలో మాత్రమే:

ఐసీసీ టోర్నీలలో మాత్రమే:

భారత జట్టు చివరిసారిగా రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో 2006లో పాక్‌లో పర్యటించింది. 2008లో 26/11 ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో.. అప్పటినుంచి టీమిండియా పాక్‌ గడ్డపై అడుగు పెట్టలేదు. ఐసీసీ వేదికగా జరిగిన టోర్నీలలో మాత్రమే దాయాదులు తలపడుతున్నారు. చివరిసారి 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ జరిగింది. 2012-13లో చివరి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆడాయి. అప్పుడు పాక్‌ జట్టు ఇక్కడ పర్యటించింది.

Story first published: Tuesday, February 25, 2020, 14:14 [IST]
Other articles published on Feb 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+