
సెహ్వాగ్ తప్పుకున్న నేపథ్యంలో కెప్టెన్సీకి గౌతం గంభీర్ పేరుతో సహా పలువురి పేర్లను జట్టు యజమాని జిఎంఆర్ పరిశీలించింది. అయితే గంభీర్ వైపే మొగ్గుచూపారు. దినేష్ కార్తిక్ వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. జట్టుకు సెహ్వాగ్ బలం, స్ఫూర్తి అని, సెహ్వాగ్ నిర్ణయాన్ని గౌరవించి అంగీకరించామని జిఎంఆర్ స్పోర్ట్స్ చైర్ పర్సన్ శ్రీనివాస్ బొమ్మిడాల అన్నారు. తనకు ఎంతో ఆనందంగా ఉందని గంభీర్ అన్నాడు. తనకు సెహ్వాగ్ మార్గదర్సి, మిత్రుడు అని అతను అన్నాడు.