న్యూఢిల్లీ: సెప్టెంబర్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా భారత వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ దూరమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. భుజానికి గాయమైన కారణంగా ప్రపంచ ట్వంటీ20 టోర్నమెంటు మధ్యలో అతను భారత్ కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. భుజానికి జరిగిన గాయం నయమయ్యేందుకు 12 నుంచి 16 వారాల పాటు పడుతుందని చెబుతున్నారు. జూన్ 11వ తేదీన సెహ్వాగ్ గాయానికి శస్త్ర చికిత్స జరుగుతుంది. ఐపియల్ సెమీ ఫైనల్ లో సెహ్వాగ్ గాయపడ్డాడు. భారత జట్టు ఫిజియో నితిన్ పటేల్ సెహ్వాగ్ గాయానికి జరుగుతున్న వైద్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.