రాంచీ: భారత క్రికెట్ వన్డే, ట్వంటీ 20 జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫుట్బాల్ మైదానంలో మెరుపులు మెరిపించాడు. ధోనీకి ప్రస్తుతం తీరిక దొరికింది. దీంతో అతను తన కూతురు జీవాతో ఆడుకోవడంతోపాటు తనకు ఇష్టమైన ఫుట్బాల్ ఆడుతున్నాడు.

శనివారం జార్ఖండ్ రాజధాని సమీపంలోని సిల్లీ ఆస్ట్రో టర్ఫ్ స్టేడియంలో పుట్బాల్ మ్ాచ్ ఆడి 6-2 తేడాతో రాంచీ ఎలెవన్ పైన తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిల్లీ స్పోర్ట్స్ అకాడమీ తరఫున ఆడిన ధోనీ ప్రొఫెషనల్ ఆటగాళ్లతో పోటీ పడి మరీ ఓ గోల్ చేశాడు.

మరో రెండు గోల్స్ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆద్యంతం స్టేడియం మహీ.. మహీ అంటూ మార్మోగింది. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వత ఫుల్ టాం మ్యాచ్ ఆడానని, ఎంజాయ్ చేశానని, కుటుంబంతో గడిపేందుకు కాస్త సమయం దొరుకుతోందన్నాడు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఈవెంట్లలో పాల్గొంటున్నానని చెప్పాడు.