For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20 గెలిచిన తర్వాత డిన్నర్ పార్టీ చేసుకున్న టీమిండియా (ఫోటోలు)

By Nageshwara Rao
See Pic: Virat Kohli and boys celebrate first T20I victory against South Africa with dinner

హైదరాబాద్: సఫారీ గడ్డపై గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా టీమిండియా అద్భుత విజయాలను సాధిస్తోంది. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా గత డిసెంబర్ నెలలో సఫారీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైన కోహ్లీసేన మూడో టెస్టు నుంచి పుంజుకున్న తీరు అద్భుతం.

అదే ఆత్మ విశ్వాసంతో ఆరు వన్డేల సిరిస్‌ను 5-1 తేడాతో దక్కించుకుంది. తాజాగా ప్రారంభ‌మైన మూడు టీ20ల సిరిస్‌లోనూ ఆధిక్యం సంపాదించింది. ఆదివారం జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ విజయం అనంతరం టీమిండియా ఆటగాళ్లు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోని, సురేష్ రైనా, శిఖ‌ర్ ధ‌ావ‌న్‌, హార్దిక్ పాండ్యా త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

'గొప్ప విజయం తర్వాత సహచర ఆటగాళ్లతో కలిసి డిన్నర్‌.. విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాం' అని కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ బుధవారం (ఫిబ్రవరి 21)న సెంచూరియన్‌లోని సూపర్‌ స్పోర్ట్‌ పార్కులో జరగనుంది.

Story first published: Monday, February 19, 2018, 15:58 [IST]
Other articles published on Feb 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+