హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు దినేశ్ కార్తీక్. రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటంతో బెంగళూరులో ఆప్ఘనిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టుతో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం దినేశ్ కార్తీక్కు చోటు దక్కించుకున్నాడు.
2007లో ఇంగ్లీషు గడ్డపై రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో టెస్టు క్రికెట్ ఆడాడు దినేశ్ కార్తీక్. మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను అప్పుడు భారత్ 1-0తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఏడు టెస్టులు ఆడిన కార్తీక్ పేలవ ప్రదర్శన చేయడంతో టెస్టులకు దూరమయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరిస్ ముగియడం... ఆ తర్వాత టెస్టు సిరీస్ ప్రారంభానికి మధ్య కొద్ది విరామం లభించడంతో దినేశ్ తన భార్య, స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్తో కలిసి డెన్మార్క్ వెళ్లాడు. వీరిద్దరూ కలిసి డెన్మార్క్లోని పలు సందర్శనా స్థలాలను చుట్టేశారు. ఈ సందర్భంగా దీపికతో దిగిన ఓ ఫొటోను దినేశ్ ఇనిస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.
'నేను... నా డ్రాగన్' అని ఫొటో కింద క్యాష్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.