న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓ ఇంటివాడైన కేరళ క్రికెటర్ సంజు శాంసన్ (ఫోటోలు)

Sanju Samson ties the knot with college-mate in Kerala

హైదరాబాద్: కేరళ క్రికెటర్ సంజు శాంసన్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తిరువనంతపురానికి సమీపంలో గల కోవలెమ్‌లోని రిసార్ట్‌లో తన కాలేజీ క్లాస్‌మేట్ అయిన చారులతను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

శనివారం సాయంత్రం రిసెప్షన్

శనివారం సాయంత్రం రిసెప్షన్

వెడ్డింగ్ రిసెప్షన్ శనివారం సాయంత్రం జరగనుంది. తిరువనంతపురంలోని మార్ ఇవనోయిస్ కాలేజీలో కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో గ్రాడ్యుయేషన్‌లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరి మధ్య మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించడంతో పెళ్లితో ఒక్కటయ్యారు.

 కేవలం 30మంది మాత్రమే అతిథులుగా

కేవలం 30మంది మాత్రమే అతిథులుగా

వీరి పెళ్లికి కేవలం 30మంది మాత్రమే అతిథులుగా హాజరైనట్లు శాంసన్ తెలిపాడు. 2015 జులైలో భారత్ తరఫున సంజు శాంసన్ ఓ అంతర్జాతీయ టీ20మ్యాచ్ ఆడాడు. గతేడాది సంజూ శాంసన్ ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, యో-యో టెస్టు పాస్ కారణంగా అతడికి బోర్డు జట్టు నుంచి తప్పించింది.

ఐపీఎల్ ద్వారా వెలుగులోకి

ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన శాంసన్ టీ20 క్రికెట్లో స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. గతేడాది వేలంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శాంసన్‌ను రూ.8కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. ఐపీఎల్ 2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంజూ శాంసన్ 15 మ్యాచ్‌ల్లో 441 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో సంజు కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Story first published: Saturday, December 22, 2018, 16:11 [IST]
Other articles published on Dec 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X