సీనియర్ క్రికెటర్స్ వల్ల జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశాలు చేజారుతున్నాయని అన్నాడు ముంబయి చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్. బీసీసీఐ కండిషన్ మేరకు రీసెంట్ గా టీమిండియా స్టార్ క్రికెటర్స్ దేశవాళీ బరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ మ్యాచులు ఆడారు. ఈ నేపథ్యంలో జట్టులో స్టార్ ప్లేయర్స్ కు చోటు కల్పించేందుకు.. పలువురు యంగ్ ప్లేయర్స్ బెంచ్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ కారణంగానే సంజయ్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
అలానే తాజాగా జరగనున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల కోసం ముంబయి జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె వచ్చారు. వారు నామమాత్రపు ప్రదర్శన చేయకుండా.. నాణ్యమైన ఆటతీరు కనబరిచేందుకు ప్రయత్నించాలని సూచించాడు సంజయ్ పాటిల్. ఎందుకంటే ఇటీవలే జమ్మూకశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో.. తమ జట్టులో (ముంబయి) రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానె వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఓడిపోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నాడు.
