|
పంపిన మెయిల్ ఎలా లీకైంది..?
ఇందులో జట్టుకు కొత్తగా వచ్చిన కోచ్ రమేశ్ పొవార్, సుప్రీంకోర్టు నియమిత బీసీసీఐ పాలకుల సభ్యురాలు డయానా ఎడుల్జీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. వారిద్దరూ తన కెరీర్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూనే వేధనాభరింతంగా తనపై జట్టులో వివక్ష చూపిన తీరుని వివరించింది. అయితే.. బీసీసీఐ పెద్దలకి పంపిన మెయిల్ ఎలా లీకైంది..? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ధోని, కోహ్లీని బీసీసీఐ అవమానించగలదా
భారత మహిళల క్రికెట్కి వన్నెతెచ్చిన మిథాలీ రాజ్ని ఈ విధంగా అవమానించడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్, శాంతి రంగస్వామి తదితరులు మండిపడ్డారు. మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని బీసీసీఐ ఇలా అవమానించే సాహసం చేయగలదా..? అని శాంతి ప్రశ్నించగా.. మిథాలీకి మంజ్రేకర్ తన సానుభూతి తెలియజేశాడు.
బహిర్గతం కాకుండా ఉండాల్సింది
‘బీసీసీఐకి మిథాలీ రాజ్ పంపిన మెయిల్ ఇలా బహిర్గతం కాకుండా ఉండాల్సింది. ఆమెకి ఈ వారం చాలా చేదు అనుభవాల్ని మిగిలిచ్చింది. సెమీస్లో జట్టు నుంచి తప్పించడం, సమాచారం బయటికి పొక్కడం.. చాలా బాధగా అనిపిస్తోంది' అని మంజ్రేకర్ వెల్లడించాడు.
మిథాలీని రిజర్వ్ బెంచ్కు పరిమితం చేయాల్సింది కాదు
ఎంతో అనుభవం ఉన్న ఓ క్రికెటర్ పట్ల ఇలా వ్యవహరించడం సరైన చర్య కాదు. అప్పటి అవసరాల దృష్ట్యా సెమీస్ మ్యాచ్లో ఆమెపై వేటు వేసి ఉండొచ్చు. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. దీనిపై నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. ఫామ్ పరంగా చూసుకుంటే మాత్రం సెమీస్ మ్యాచ్లో మిథాలీని కచ్చితంగా ఆడించాల్సింది. మిథాలీని ఆమెను రిజర్వ్ బెంచ్కు పరిమితం చేయడం మాత్రం దారుణమైన చర్యే.