లండన్: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాదీ సానియా మీర్జా ఎట్టకేలకు ట్విట్టర్ ప్లాట్ఫామ్పైకి తిరిగొచ్చారు. ఈ నెల 16వ తేదీన మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత్ జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ అవమానక ఓటమిని ఎదుర్కొన్న తరువాత సానియా మీర్జా ట్విట్టర్కు దూరం అయ్యారు. పాకిస్తాన్ దారుణంగా పరాజయం పాలు కావడానికి సానియా మీర్జా పరోక్షంగా కారణం అయ్యారని అంటూ ట్విట్టర్ వేదికగా ఆమెపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
వహ్! క్యా జీత్ హై: ఉబ్బితబ్బిబ్బవుతున్న పాకిస్తాన్ ప్రధాని
భారత్తో మ్యాచ్కు ముందురోజు రాత్రి సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్, కేప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలర్ హఫీజ్ వంటి వంటి కొందరు పాకిస్తాన్ క్రికెటర్లకు మాంఛెస్టర్లో విల్స్లో రోడ్డులో ఉన్న 360 శీషా రెస్టారెంట్లో పార్టీ ఇచ్చారని, అర్ధరాత్రి దాటిపోయేంత వరకూ అక్కడే కాలక్షేపం చేశారని అంటూ ఆరోపణల జడిమాన కురిసింది. దీనితో సానియా మీర్జా ట్విట్టర్ అంటేనే భయాందోళనకు గురయ్యారు. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాంపైకి రావడానికి ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో- ఆమె ట్విట్టర్కు తాత్కాలికంగా గుడ్పై చెప్పారు.
What an incredibly great leveler sport can be 🙃😏
— Sania Mirza (@MirzaSania) June 26, 2019
తాజాగా- బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో న్యూజీలాండ్పై స్ఫూర్తిదాయకమైన విజయాన్ని సాధించడంతో ఆమె ప్రపంచానికి తన ముఖాన్ని చూపారు. ఆసక్తికర ట్వీట్లను సంధించారు. పాకిస్తాన్ మొత్తం క్రీడారంగంలో అత్యుత్తమమైన, స్ఫూర్తి దాయక విజయాన్ని సాధించిందని ప్రశంసించారు. ఇదే పోరాటాన్ని మిగిలిన మ్యాచ్లల్లో చూపించాలని అకాంక్షించారు. 1992 ప్రపంచకప్ నాటి పరిస్థితులు ఇప్పుడు మళ్లీ ఏర్పడ్డాయని, ఇదే కొనసాగితే ప్రపంచకప్ ఎవరి వశం అవుతుందో వేరే చెప్పాల్సిన పని లేదని అన్నారు.