హైదరాబాద్: ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను శ్రీలంక పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ సనత్ జయసుందరపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సస్పెన్షన్ విధించింది. ఐసీసీ మీడియా కథనం ప్రకారం జయసుందరపై విధించిన సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఆర్టికల్ 2.1.3 ప్రకారం క్రీడా మంత్రికి అవార్డు కోసం లంచం ఇవ్వజూపినా, ఫలితం కోసం పరపతిని వాడుకున్నా... అంతర్జాతీయ మ్యాచ్కు బదులు వేరే మ్యాచ్ నిర్వహించినా, ఆర్టికల్ 2.1.1 ప్రకారం ఫలితం వ్యతిరేకంగా వచ్చేందుకు ప్రభావితం చేసినా, వేరే అంతర్జాతీయ మ్యాచ్ ఆడించినా శిక్షార్హులు.
దీంతో పాటు ఆర్టికల్ 2.4.7ప్రకారం ఏసీయూ విచారణను ఆలస్యం చేసినందుకు ఐసీసీ యాంటి కరప్షన్ కోడ్ అనుసరించి శిక్ష విధించనున్నారు. ఈ నిబంధన ప్రకారం అతడిపై విధించిన సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వచ్చింది. అయితే, 14 రోజుల్లోగా అతనికి విధించిన శిక్షలపై స్పందించాల్సి ఉంటుంది.