భారత్ ఘోర వైఫల్యం ఇలా:
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు 47.4 ఓవర్లలో 240 పరుగులకే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.
కోహ్లీని వెస్టిండీస్ బుట్టలో వేసినట్లు శామ్యూల్స్
మ్యాచ్లో సెంచరీకి పైగా కెప్టెన్ విరాట్ కోహ్లి (107: 119 బంతుల్లో 10ఫోర్లు, 1సిక్సు) కొట్టాడు. టీమిండియా 220 స్కోరు వద్ద కీలక సమయంలో కోహ్లీ ఔట్ అయ్యాడు. దీంతో.. భారత్ చేతి నుంచి మ్యాచ్ చేజారింది. అయితే.. పక్యా వ్యూహంతోనే కోహ్లీని వెస్టిండీస్ బుట్టలో వేసినట్లు బౌలర్ శామ్యూల్స్ మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇన్నింగ్స్ 42వ ఓవర్, శామ్యూల్స్ మ్యాచ్లో వేసిన తొలి ఓవర్ మూడో బంతికే విరాట్ కోహ్లిని బౌల్డ్ చేశాడు.
బౌండరీ లైన్కి సమీపంలో ఫీల్డర్లని ఉంచిన వెస్టిండీస్
వాస్తవానికి కాలి గాయం కారణంగా.. గత కొంతకాలంగా బౌలింగ్కి దూరంగా ఉంటున్న శామ్యూల్స్ నెట్స్లో కనీసం ప్రాక్టీస్ కూడా చేయట్లేదట. అయినప్పటికీ.. పుణె వన్డేలో అతను విసిరిన బంతిని అర్థం చేసుకోలేకపోయిన కోహ్లి.. క్లీన్ బౌల్డయ్యాడు. మిడ్ వికెట్, లాంగాన్లో మాత్రమే బౌండరీ లైన్కి సమీపంలో ఫీల్డర్లని ఉంచిన వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్.. క్రీజులో ఉన్న కోహ్లీని ఫుల్షాట్ ఆడేలా ప్రేరేపించాడు. అప్పటికే క్రీజులో ప్రధాన బ్యాట్స్మెన్ ఎవరూ లేకపోవడంతో కోహ్లీ కూడా సాహసోపేత షాట్కి ప్రయత్నించి బౌల్డయ్యాడు.
మ్యాచ్ని మలుపు తిప్పినందుకు సంతోషంగా
మోకాలి గాయం నుంచి నేను ఇటీవల కోలుకోవడంతో.. నెట్స్లో కూడా బౌలింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయట్లేదు. సిరీస్లో నేను బ్యాట్తో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోవడంతో.. కనీసం బౌలింగ్తోనైనా.. మ్యాచ్ని మలుపు తిప్పినందుకు సంతోషంగా ఉంది' అని మ్యాచ్ అనంతరం శామ్యూల్స్ చెప్పుకొచ్చాడు.