హైదరాబాద్: సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు టచ్లో ఉంటే వాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి ఒకరు. ధోని, కుమార్తె జీవాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా సాక్షి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే... ధోని ఓ యాడ్ షూటింగ్ కోసం కుటుంబంతో కలిసి సిమ్లాకు వెళ్లిన సంగతి తెలిసిందే. షూటింగ్ అనంతరం సిమ్లా అందాలను వీక్షించిన భర్త ధోనితో కలిసి సాక్షి విమానంలో తిరుగుపయనయ్యారు.
అయితే, వీరిద్దరూ ఎక్కిన విమానాన్ని నడిపే ఇద్దరు పైలెట్లు భార్యభర్తలు కావడంతో సాక్షి ఆశ్చర్యపోయింది. దీంతో వారు విమానాన్ని ఆపరేటింగ్ చేసే విధానాన్ని వీడియో తీసి "భార్యాభర్తలిద్దరూ ప్రయాణం మధ్యలో గొడవ పెట్టుకోకూడదని కోరుకుంటున్నా.. ఈ రోజు కెప్టెన్ భార్య అయితే గొడవ ఉండకపోవచ్చు" అంటూ కామెంట్ పెట్టింది.
సాక్షి కామెంట్పై స్పందించిన ధోని "భయపడకు నీ పక్కనే కూల్ హెలికాప్టర్ ఉంది" అంటూ పేర్కొన్నాడు. సాక్షి పోస్టు చేసిన ఈ వీడియో నెటిజన్లను ఎంతోగానో ఆకట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిమిషాల్లోనే వేల లైక్స్, వందల కామెంట్లు వచ్చాయి.