సిడ్నీ: ప్రపంచ కప్లో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత్ ఆటగాళ్లు క్యూ కట్టారు! భారత్ అద్భుతం జరిగితే తప్ప.. ఓటమి దిశలో సాగుతోంది. ఈ మ్యాచ్లో బాగా ఆడతాడని ఎన్నో అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ దారుణంగా నిరాశపర్చాడు.
అతను 13 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. భారత జట్టుకు, విరాట్ కోహ్లీకి చీర్స్ చెప్పేందుకు అనుష్క శర్మ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్కు వచ్చారు. కోహ్లీ విఫలమైన నేపథ్యంలో సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో అనుష్క పైన క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుష్క శర్మ పైన ట్విట్టర్లో కరుకుగానే స్పందించారు. భారత్ ఓటమికి, కోహ్లీ విఫలం కావడానికి అనుష్కనే కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో విఫలమవడమే కాకుండా.. ఆసిస్ ఇన్నింగ్స్లో హాడిన్ క్యాచ్ మిస్ చేశాడు. ట్విట్టర్లో అనుష్క పైన ఇలా....