ఫ్లాట్ పిచ్లు ఉంటాయి:
ముంబైలోని ఎంఐజీ మైదానంలో గురువారం సచిన్ పేరుతో పెవిలియన్ ఎండ్ను ప్రారంభించిన సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడారు. 'ఈ ప్రపంచకప్ మంచి వేసవిలో జరగనుంది. గతంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పిచ్లన్నీ ఫ్లాట్గా ఉన్నాయి. సూర్యుడు వెళ్లినా కూడా పిచ్లలో ఎలాంటి మార్పు కనపడలేదు. ఇప్పుడు కూడా అలాంటి పిచ్లే ఉంటాయి. అలాంటి పిచ్పై బ్యాట్స్మెన్ సౌకర్యంగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటే తప్ప పిచ్పై ప్రభావం ఉండదు. ఉన్నా కొన్ని ఓవర్ల పాటే ఉంటుంది' అని సచిన్ తెలిపారు.
ఐపీఎల్లో రాణిస్తున్నారు:
'ప్రస్తుత ఐపీఎల్ సీజన్-12లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యతో పాటు ఇతర ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఒక క్రికెటర్ ఏ ఫార్మాట్లో రాణించినా అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో ఫార్మాట్ మారినా పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మలుచుకోగలరు' అని సచిన్ పేర్కొన్నారు.
భారత్కు కప్ ఖాయం:
'టీమిండియా ఆటగాళ్లంతా ఇప్పటికే సరిపడా క్రికెట్ ఆడారు. టెస్ట్, వన్డే, టీ20 అన్నిఫార్మాట్లలో రాణించారు. వారు మెరుగుపడాల్సిన అంశాలను ఇప్పటికే తెలుసుకొని ఉంటారు. ప్రపంచకప్లో భారతే ఫేవరెట్ జట్టు. కచ్చితంగా భారత్కు కప్ వస్తుంది' అని సచిన్ ధీమా వ్యక్తం చేశారు.