
ఆరో క్రికెటర్గా సచిన్ టెండూల్కర్
దీంతో భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ అరుదైన ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ కన్నా ముందు బిషన్సింగ్ బేడి(2009), సునీల్ గవాస్కర్(2009), కపిల్దేవ్(2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018) ఈ ఘనత దక్కించుకున్న వారి జాబితాలో ఉన్నారు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడంపై సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ "నాకు లభించిన ఈ గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉంది, ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా" అని సచిన్ పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్లో వంద సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్ సచినేనని ఐసీసీ ప్రశంసలు కురిపించింది.

సచిన్ టెండూల్కర్కి శుభాకాంక్షలు
ఈ సందర్భంగా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్దనే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్లో షేర్ చేసింది. "లెజెండ్ అనే పదం సచిన్కి తక్కువే.. తాజాగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఆయనకి స్థానం కల్పించాం" అని ఐసీసీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది.

అలెన్ డొనాల్డ్ సైతం
కాగా, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలన్ డోనాల్డ్(52) సైతం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కి ఎంపికయ్యాడు. డొనాల్డ్ టెస్టుల్లో 330, వన్డేల్లో 272 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి అలెన్ డొనాల్డ్ 2003లో వీడ్కోలు పలికాడు. మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో క్రికెటర్గా పేరొందిన ఫిట్జ్పాట్రిక్కు అరుదైన గౌరవం లభించింది. వన్డేల్లో 180, టెస్టుల్లో 60 వికెట్లు తీసింది.


Click it and Unblock the Notifications












