
ఎలా మెయింటెయిన్ చేయాలో తెలుసు..!
ఇక సచిన్, గంగూలీ, రాజీవ్ శుక్లా తదితరులు ఈరోజు ముందస్తు బర్త్ డే పార్టీ చేసుకున్నారు. సచిన్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ దిగ్గజం గంగూలీ గొప్ప సారథి అని, ఆటగాళ్లతో ఎలా బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలో అతనికి తెలుసునని చెప్పాడు. గంగూలీ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు.. భారత జట్టు పరివర్తన దశలో ఉందన్నాడు. 'సౌరవ్ గొప్ప కెప్టెన్. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం, వారికి బాధ్యతలు ఇవ్వడం, ప్లేయర్లతో బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం అతనికి బాగా తెలుసు. అతను బాధ్యతలు స్వీకరించినప్పుడు.. భారత క్రికెట్ ఓ కీలక దశలో ఉంది. ఇండియా టీంకు భావి ప్లేయర్లు కావాల్సిన తరుణమది. ఆ టైంలో భారత్ను సరైన పథంలో గంగూలీ నడిపించాడు.' అని టెండూల్కర్ అన్నారు.

వాళ్లందరికీ గంగూలీ సపోర్ట్
గంగూలీ.. అప్పుడప్పుడే టీంలోకి అరంగేట్రం చేసిన ఆటగాళ్లకు అవసరమైన సహాయాన్ని అందించేవాడని, వారు తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను వారికి ఇచ్చేవాడని సచిన్ తెలిపాడు. 'ఇక గంగూలీ కెప్టెన్గా ఉన్న టైంలో టీమిండియాకు కొందరు అగ్రశ్రేణి ఆటగాళ్లు తయారయ్యారు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా లాంటి కొందరు దిగ్గజ ప్లేయర్లు గంగూలీ హయాంలో రూపొందినవారే. వారు చాలా ప్రతిభావంతులైన ఆటగాళ్లు. కానీ ఎంత ప్రతిభావంతుడైనా తమ కెరీర్ ప్రారంభంలో వారికి మద్దతు అవసరం. సౌరవ్ గంగూలీ వారికి ఆ సపోర్ట్ ఇవ్వగలిగాడు. అలాగే జట్టులో వారి రోల్స్ ఏంటో అవగాహన పరిచేవాడు. వాళ్లు తమ భావాలను గంగూలీతో స్వేచ్ఛగా చెప్పుకునే వీలు కల్పించాడు. తద్వారా వారు తమను తాము రూపొందించుకునే వేదికను ఏర్పాటు చేశాడు.' అని టెండూల్కర్ చెప్పాడు.

గంగూలీ కెరీర్
గంగూలీ అంతర్జాతీయ క్రికెట్లో 113 టెస్ట్ మ్యాచ్లు ఆడి 42సగటుతో 7212 పరుగులు చేశాడు. ఇందులో 35 హాఫ్ సెంచరీలు, 16 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 239పరుగులు. 311 వన్డే మ్యాచ్లు ఆడిన గంగూలీ 41 సగటుతో 11,363 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 183 పరుగులు. గంగూలీ కెప్టెన్గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. భారత జట్టును ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఇక ఐపీఎల్లో 59 మ్యాచ్లు ఆడిన గంగూలీ 25 సగటుతో 1349 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 91 పరుగులు.


Click it and Unblock the Notifications
