హైదరాబాద్ : హైదరాబాదులో జరుగుతున్న రెండో టెస్టులో శతకాల అర్ధసెంచరీ చేసి హైదరాబాద్ లో తన చిరస్మరణీయ ఇన్నింగ్సును ఆడతాడని ఆశలు పెట్టుకున్న సచిన్ 13 పరుగులకే తన వికెట్టును కోల్పోయాడు. మూడో రోజు ఆట ప్రారంభం అయిన కాసేపటికే సచిన్ వెట్టోరీ బౌలింగ్ లో ఔటయ్యాడు. అప్పటికి భారత్ పరుగులు 184. సచిన్ చేసిన పరుగులు 13. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కడపటి సమాచారం అందేసరికి మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. రాహుల్ ద్రావిడ్ , హైదరాబాది సొగసరి బ్యాట్స్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు అన్ని వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసిన విషయం తెలిసిందే.