తిరువనంతపురం: విరాట్ కోహ్లీ - అనుష్క శర్మల అనంతరం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టులో మరో ఆటగాడు పెళ్లికి సిద్ధమయ్యాడు. కేరళ క్రికెటర్ సచిన్ బేబీ తన ప్రియురాలు అన్నా చాందీని వివాహం చేసుకోనున్నాడు.

ఏడాదిగా డేటింగ్ చేస్తున్నామని, అన్నా చాందీని పెళ్లి చేసుకోబోతున్నట్లు సచిన్ బేబీ ప్రకటించాడు. ఈ జంట వివాహ ఆహ్వాన వీడియోను కోకోనట్స్ వెడ్డింగ్స్ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కేరళ క్రికెట్ అసోసియేషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళరు, సచిన్ టెండుల్కర్ అభిమానులకు తొలుత కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం అన్నా చాందీ వేసిన బంతికి సచిన్ బేబీ బౌల్డ్ అవుతాడు. అనంతంర ఇద్దరు ఒకరి ప్రేమను మరొకరు చాటుకుంటారు. ఈ నెల 5వ తేదీన తోడుపుఝాలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది. 2009లో కేరళ తరఫున క్రికెట్లోకి అడుగు పెట్టిన బేబీ.. ఇప్పటి దాకా 47 మ్యాచులలో 2092 పరుగులు చేశాడు. 2015 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ జట్టులో చేరాడు. అతను 11 ట్వంటీ 20ల్లో 119 పరుగులు చేశాడు.