
క్రికెట్ ఆడటం నా హక్కు
'క్రికెట్ మినహా నా జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. క్రికెట్ ఆడటం నా హక్కు. ఆ హక్కు కోసం నేను సుప్రీం కోర్టులో పోరాడతా. ఈ పోరాటం కేవలం దేశానికి ఆడటం కోసం మాత్రమే కాదు. నా పరువు ప్రతిష్టల్ని తిరిగి పొందడానికి. ఈ నాలుగేళ్లు వేచి చూశా. కానీ ఇక మౌనంగా ఉండలేను' అని శ్రీశాంత్ అన్నాడు.

అసలేం జరిగింది?
2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ శ్రీశాంత్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీశాంత్పై బోర్డు విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం ఆగస్టు 7న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

శ్రీశాంత్పై నిషేధాన్ని కొనసాగించిన హైకోర్టు
శ్రీశాంత్పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీసీసీఐ తిరిగి కోర్టును ఆశ్రయించింది. దీంతో (అక్టోబర్ 17) మంగళవారం ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ నవనీతి ప్రసాద్ సింగ్, జస్టిస్ రాజా విజయరాఘవన్లతో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసి, శ్రీశాంత్ నిషేధాన్ని కొనసాగించింది.
ఇటీవల శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత జట్టుతో పాటు ఐపీఎల్లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్తో సంబంధం ఉందని శ్రీశాంత్ వ్యాఖ్యానించినట్లు ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 'ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయి' అని శ్రీశాంత్ అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











