లక్నో సూపర్ కింగ్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మంగళవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారీ స్కోరును కాపాడుకోలేక టాప్-4లో స్థానాన్ని చేజార్చుకుంది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి పడిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నాలుగు వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (108*; 60 బంతుల్లో, 12x4, 3x6) అజేయ శతకంతో చెలరేగాడు. అతనికి తోడుగా శివమ్ దూబె (66; 27 బంతుల్లో, 3x4, 7x6) కూడా సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మార్కస్ స్టొయినిస్ (124*; 63 బంతుల్లో, 13x4, 6x6) విధ్వంసం సృష్టించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. నికోలస్ పూరన్ (34; 15 బంతుల్లో, 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి సెంచరీ చేసిన మూడు మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓటమిపాలైంది. కోహ్లి తర్వాతి స్థానంలో హషీమ్ ఆమ్లా (2), సంజు శాంస్ (2), రుతురాజ్ (2) ఉమ్మడిగా ఉన్నారు. ఈ ముగ్గురు మూండకెల స్కోరు అందుకున్నప్పటికీ రెండు మ్యాచ్ల్లో జట్టును గెలిపించలేకపోయారు. సీఎస్కే-ఎల్సీజీ మ్యాచ్లో మరో రికార్డు నమోదైంది. ఐపీఎల్లో ఓ మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదైన ఏడో మ్యాచ్గా ఈ పోరు రికార్డులకెక్కింది. ఈ జాబితాలో ఈ సీజన్లోనే జరిగిన మూడు మ్యాచ్లు ఉండటం విశేషం.