మంగళవారం రాజస్థాన్ రాయల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్, యజుర్వేంద్ర చాహల్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. స్పిన్నర్లపై కోహ్లీ స్విప్ షాట్లు ఆడాలని చెప్పాడు. కోహ్లీ స్విస్ షాట్లు ఆడడలేడని తెలుసని, అందుకే దానికి తగ్గట్టు ఫీల్డ్ చేస్తారని, కానీ ఒక్క సారి స్వీప్ షాట్లు ఆడడం మొదలు పెడితే బౌలర్ ఎవరనే సంగతి అవసరం లేదని ఆయన అన్నాడు. తన సహజసిద్దమైన ఆటను ప్రదర్శించాలని చెప్పాడు. పంజాబ్ కింగ్స్తో ఆడిన తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడని కొనియాడాడు.
కాగా ఆ మ్యాచ్లో 29 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్లో మాత్రం విఫలమయ్యాడు. పంజాబ్ కింగ్స్తో ఆడిన మ్యాచ్లో కోహ్లీ ఆట తీరు, క్రీజులో అతని కదలిక బాగుందని రవిశాస్త్రి మెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ నుంచి అంతా ఇలాంటి ఆటనే ఆశిస్తారని చెప్పుకొచ్చాడు. ఒక వేళ కోహ్లీ భారీ షాట్లు ఆడలేకపోతే స్ట్రైక్ రోటేట్ చేయాలని రవిశాస్త్రి సూచించాడు. కాగా ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
పూర్తి జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ కౌల్, కర్ణ్ శర్మ , చామ వి మిలింద్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెయిన్ మాక్స్వెల్, అనీశ్వర్ గౌతమ్.
రాజస్థాన్ రాయల్స్:
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, జేమ్స్ నీషమ్, రాస్సీ డెర్ దుస్సేన్, కెసి కరియప్ప, డారిల్ మిచెల్, ఒబెడ్ మెక్కాయ్, తేజస్ బరోకా, కుల్దీప్ యాదవ్, అనునయ్ సింగ్, కుల్దీప్ సేన్, నాథన్ కౌల్టర్-నైల్, ధ్రువ్ జురెల్, శుభమ్ గర్వాల్