
సంజూ శాంసన్ ఏమన్నాడంటే..
తాము మొదటగా బౌలింగ్ చేయలానుకుంటున్నామని టాస్ గెలిచిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చెప్పాడు. మ్యాచ్పై మంచు ప్రభావం ఉందని, అయితే తాము పరిస్థితులను ఉపయోగించుకుంటామని తెలిపాడు. కాగా ఈ మ్యాచ్లో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్లో ట్రెంట్ బౌల్ట్ ఆడడం లేదని, అతని స్థానంలో జిమ్మీ నీషమ్ బరిలోకి దిగుతున్నట్లు శాంసన్ చెప్పాడు.

హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే..
టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవారిమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. ప్రస్తుతం టాస్ గురించి పెదగా పట్టించుకోవడం లేదని తెలిపాడు. అలాగే తాను కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నట్లుచెప్పాడు. టీం అంతా రాణిస్తుందని, తర్వాతి మ్యాచ్ల్లోని ఇదే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక తాను బ్యాట్తో తప్పితే బాల్తో సహకరించగలనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక తమ బౌలింగ్ విభాగంగా అద్భుంతంగా రాణిస్తుందని కొనియాడాడు. ఈ మ్యాచ్లో తాము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామని, దర్శన్ నల్కండే స్థానంలో యష్ దయాల్, సాయి సుదర్శన్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చినట్టు చెప్పాడు.

తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), శుభమన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, యశ్ దయాల్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(వికెట్ కీపర్/ కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, షిమ్రాన్ హెట్మెయర్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications












